LOADING...
Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ

Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మీడియా, వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది. కంటెంట్, సృజనాత్మకత, సాంకేతికత సమ్మేళనం ద్వారా ఈ రంగం 2024లో రూ.2.5 లక్షల కోట్ల విలువను దాటింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ అనిల్ కుమార్ లహోటి అంచనా ప్రకారం, రాబోయే మూడేళ్లలో 2027 నాటికి ఈ రంగం రూ.3 లక్షల కోట్ల మైలురాయిని తాకనుంది. ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ సదస్సులో ఆయన ఈ రంగ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. గతేడాది మీడియా, వినోద రంగం నుండి వచ్చిన ఆదాయం రూ.2.5 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది.

Details

వినియోగదారుల సంఖ్య 60 కోట్లు

అందులో టెలివిజన్, ప్రసార విభాగం మాత్రమే దాదాపు రూ.68,000 కోట్లుగా ఉందని లహోటి తెలిపారు. అనలాగ్ నుంచి డిజిటల్, ఆపై 4K ప్రసారాల వరకు సాంకేతిక పరిణతి ఈ రంగంలో విశేషం అని ఆయన చెప్పారు. స్మార్ట్ టీవీలు, 5G టెక్నాలజీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రావడంతో వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటింది. కానీ దేశంలోని 190 మిలియన్ల గృహాల్లో ఇప్పటికీ సంప్రదాయ లీనియర్ టెలివిజన్ ఆధిపత్యం కొనసాగుతుందని లహోటి గుర్తుచేశారు. వృద్ధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు నియంత్రణ, ఆవిష్కరణల మధ్య సమతుల్యత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Details

వ్యాపార ప్రక్రియ మరింత సులభతరం

"ఆవిష్కరణలు, ఆరోగ్యకరమైన పోటీ ద్వారా క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడం ట్రాయ్ విధానం. వినియోగదారులకు పూర్తి పారదర్శకత కల్పించడం, చిన్న సంస్థల ప్రయోజనాలను కాపాడడం కూడా మా బాధ్యత" అని వివరించారు. వ్యాపార ప్రక్రియలను సులభతరం చేసేందుకు ట్రాయ్ అనేక చర్యలు చేపడుతోంది. కేబుల్, టీవీ ప్రసార చట్టాల్లో సవరణలు, 2023 టెలికమ్యూనికేషన్ చట్టం కింద ప్రతిపాదించిన కొత్త అధికారాల వ్యవస్థ ఇవన్నీ ఈ దిశలో అడుగులు అని ఆయన చెప్పారు.