NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 
    తదుపరి వార్తా కథనం
    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 
    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం

    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 26, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడమే కాకుండా,నిల్వలను కూడా సరిపడా అందుబాటులో ఉంచటం కోసం ఎగుమతులపై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ ని విధించింది.

    ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి వచ్చింది.

    ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    అయితే, ఎల్‌ఈవో (లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్)జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన ఉప్పుడు బియ్యానికి ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ వర్తించదని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది.

    Details 

    బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం

    దాంతో పాటు సరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఉన్న ఎక్స్పోర్ట్ లకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.

    ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎక్స్పోర్ట్ ల పై కేంద్రం నిషేధం అమలు చేయడంతో.. ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది.

    ఫలితంగా వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్బంగా దేశీయంగా పార్‌బాయిల్డ్‌ రైస్‌ నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్‌ ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది.

    మన దేశ బియ్యం ఎక్స్పోర్ట్స్ లో బాస్మతియేతర తెల్ల బియ్యం షేర్ 25శాతంగా ఉంటోంది. అలాగే, దేశీయంగా బియ్యం రేట్ లు పెరుగుతున్న నేపథ్యంలో గత నెల బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

    Details 

    సంవత్సరం వ్యవధిలో 11.5 శాతం మేర పెరిగిన బియ్యం రేట్లు 

    పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్‌ చేయని తెల్ల బియ్యం ఎక్స్పోర్ట్స్ పై ఈ నిషేధం వర్తిస్తుంది.

    అంతకుముందు నూకలపైనా ఇప్పుడు పార్‌బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతులపైనా సుంకం అమలు చేయడంతో.. అన్నిరకాల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లయింది.

    దేశీయ రిటైల్‌ మార్కెట్లో సంవత్సరం వ్యవధిలో బియ్యం రేట్లు 11.5 శాతం మేర పెరిగాయి. దింతో ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య 15.54 లక్షల టన్నుల నాన్‌ బాస్మతీ రైస్‌ మన దేశం నుంచి ఎగుమతైంది.

    అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగడం, దాని కారణంగా నిల్వలు తగ్గి దేశీయంగా ధరలు పెరగడంతో.. ఈ బియ్యం రకాలపై కేంద్రం నిషేధం విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    కేంద్ర ప్రభుత్వం

    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ చంద్రబాబు నాయుడు
    BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాలు
    టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా? టమాట
    RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025