
Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ పెరుగుదల కనబరుస్తున్నాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపర్ల కొనుగోళ్ల ప్రభావంతో మదుపర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ నేపథ్యంలో, సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 23,600 మార్కు పైకి ఎగసింది.
బీఎస్ఈలో మదుపర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం రూ.418 లక్షల కోట్లకు చేరుకుంది.
మధ్యాహ్నం 12.42 గంటల సమయంలో, సెన్సెక్స్ 982.01 పాయింట్ల లాభంతో 77,887.52 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
ఒక్క రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు.. ఇదే మొదటిసారి
నిఫ్టీ 285.40 పాయింట్లు పెరిగి 23,635.80 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
అయితే, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
గత శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ.7,470 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
గత నాలుగు నెలల్లో ఒక్క రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి.