NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు  
    తదుపరి వార్తా కథనం
    Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు  
    ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు

    Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

    మైసూరు క్యాంపస్‌లో పనిచేస్తున్న దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది.

    ఈ పరిణామంపై కార్మిక యూనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    తాజా సమాచారం మేరకు, ఈ వ్యవహారం ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) చేరినట్లు తెలుస్తోంది.

    ఈ బలవంతపు లేఆఫ్‌ల (Trainees Layoffs)పై ట్రైనీలు పీఎంఓకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి, దీనిపై జాతీయ మీడియా కథనాలు హైలైట్ చేశాయి.

    వివరాలు 

    స్పందించిన కార్మిక శాఖ

    ఈ తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయానికి 100కు పైగా ఫిర్యాదులు అందినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులను నిరోధించాలని ట్రైనీలు కోరినట్లు సమాచారం.

    దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి, తగిన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

    సంబంధిత వ్యవహారంలో కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25న నోటీసులు పంపినట్లు కథనాలు పేర్కొన్నాయి.

    రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేసి, కేంద్రానికి నివేదిక అందించాలని సూచించినట్లు సమాచారం.

    వివరాలు 

    400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్‌ లేఆఫ్‌

    ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో, మైసూరు క్యాంపస్‌లోని సుమారు 400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్‌ లేఆఫ్‌ చేసింది.

    వారిని తక్షణమే క్యాంపస్‌ను వీడాలని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.

    దీనిపై ఇన్ఫోసిస్‌ స్పందిస్తూ, వరుసగా మూడు ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

    ఈ పరీక్షలు సంస్థ నిబంధనలలో భాగమని, కంపెనీ అభివృద్ధికి అవసరమైనవని పేర్కొంది.

    వివరాలు 

    వీరంతా 2022 బ్యాచ్‌ ఉత్తీర్ణులు

    2022-23 నియామక ప్రక్రియలో భాగంగా, ఇన్ఫోసిస్‌ 2000 మంది ఫ్రెషర్లను ఎంపిక చేసింది.

    సిస్టమ్‌ ఇంజినీర్‌, డిజిటల్‌ స్పెషలిస్ట్‌ ఇంజినీర్‌ వంటి పోస్టులకు ఎంపిక చేసి, అదే ఏడాది వారికి ఆఫర్‌ లెటర్లు ఇచ్చింది.

    వీరంతా 2022 బ్యాచ్‌ ఉత్తీర్ణులు. అన్ని అవసరమైన పరీక్షలు పూర్తి చేసినప్పటికీ, సంస్థ వీరిని విధుల్లోకి తీసుకోవడంలో ఆలస్యం చేసింది.

    దీనివల్ల ఇన్ఫోసిస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి, అలాగే కార్మిక శాఖ వద్ద ఫిర్యాదులు నమోదయ్యాయి.

    చివరకు, 2024 ఏప్రిల్‌లో, రెండు సంవత్సరాల ఆలస్యంతో వారిని ఉద్యోగాల్లోకి చేర్చింది.

    అయితే, గతేడాది మైసూరు క్యాంపస్‌లో చేరిన ట్రైనీలలో సగం మందిపై ఇప్పుడు వేటు వేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  ఉద్యోగులు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025