NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / L and T chairman:సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    L and T chairman:సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు
    సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు

    L and T chairman:సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 12, 2025
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

    నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలే దీనికి కారణమని పేర్కొన్నారు.

    చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కార్మికుల కొరతపై మాట్లాడిన సుబ్రహ్మణ్యన్‌ తమ సంస్థలో 2.5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వెల్లడించారు.

    ఉద్యోగుల సంఖ్య తగ్గడం పెద్ద సమస్య కాదని కానీ కార్మికుల లభ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

    Details

    వలస వెళ్లడానికి ఇష్టపడడం లేదు

    ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వలస వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. అలాగే, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణమయ్యుండొచ్చు.

    వాటివల్లే వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలన్న ఆసక్తి తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కార్మికుల్లోనే కాదు, వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని అన్నారు.

    తనకు ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు మా బాస్‌ దిల్లీలో పని చేయమని చెప్పారు. కానీ, ఇప్పుడైతే ఎవరైనా అలా అడిగితే, 'బై' అంటూ వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.

    ఇటీవల సుబ్రహ్మణ్యన్‌ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

    Details

    వారానికి 90 గంటలు పనిచేయాలి

    ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎంతసేపు భార్యను చూస్తూ ఉంటారు? ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉండాలని భార్యలకు చెప్పాలి.

    వారానికి 90 గంటల పని చేయాలి, ఆదివారం సెలవును వదిలేయాలని ఆయన వ్యాఖ్యానించడం నెట్టింట పెను దుమారం రేపింది.

    ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ తన ఛైర్మన్‌ వ్యాఖ్యలను సమర్థించింది.

    భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే, అసాధారణ కృషి అవసరమని, అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇది అవసరమైన మార్గం అంటూ కంపెనీ వివరణ ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ఇండియా

    HMPV Virus: మహారాష్ట్రలో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్.. ఆరోగ్యశాఖ అప్రమత్తత! మహారాష్ట్ర
    HMPV: హెచ్ఎంపీవీ అంటే ఏమిటి? వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే! జీవనశైలి
    Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు! ఆంధ్రప్రదేశ్
    H1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025