
IPO Updates: ఐపీఓల జోష్.. రూ.15 వేల కోట్లకు బిడ్లు రూ.1.85 లక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిదొడుకుల అనంతరం మళ్లీ ప్రైమరీ మార్కెట్ నూతన కలను సంతరించుకుంది. కొంతకాలంగా పబ్లిక్ ఇష్యూల పరంగా కాస్త నిశ్శబ్దంగా ఉన్న మార్కెట్.. ఇప్పుడు మళ్లీ ఐపీఓలతో దద్దరిల్లుతోంది. ముఖ్యంగా జులై చివరి వారం నాటికి ఐపీఓలపై ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కల్పతరు, ఎలెన్బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్, సంభవ్ స్టీల్ ట్యూబల్స్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థలు కలిపి రూ.15,600 కోట్ల విలువైన ఈష్యూలను అందించగా.. షేర్లకు మొత్తం రూ.1.85 లక్షల కోట్ల బిడ్లు దాఖలవ్వడం గమనార్హం.
Details
లిస్టింగ్ హంగామా - 19 కంపెనీలు సిద్ధం
వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ సందడి ప్రధానంగా కనిపించనుంది. మొత్తం 19 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీలపై అడుగుపెట్టనున్నాయి. ఇందులో 6 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి, మిగిలిన 13 కంపెనీలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా ఉన్నాయి. జులై 1న మెయిన్ బోర్డు నుంచి కల్పతరు (2.26 రెట్లు సబ్స్క్రిప్షన్), ఎలెన్బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ (22.19 రెట్లు), గ్లోబల్ సివిల్ ప్రాజెక్ట్స్ (86.04 రెట్లు) లిస్ట్ కానున్నాయి. జులై 2న భారీ అంచనాల మధ్య వచ్చిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (16.69 రెట్లు), సంభవ్ స్టీల్ ట్యూబ్స్ (31.82 రెట్లు) మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి . జులై 3న ఇండో గల్ఫ్ క్రాప్సైన్స్ షేర్లు లిస్టింగ్ పొందనున్నాయి.
Details
ఎస్ఎంఈ విభాగం నుంచి లిస్ట్ కానున్న కంపెనీలు
ఏజేసీ జువెల్ మానుఫాక్చరర్స్, శ్రీ హరేకృష్ణ స్పాంజ్ ఐరన్, ఐకాన్ ఫెసిలిటేటర్స్, అబ్రమ్ ఫుడ్స్, సూపర్టెక్ ఈవీ, సన్టెక్ ఇన్ఫ్రా సహా మరిన్ని సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజీలపై ఎస్ఎంఈ కేటగిరీలో లిస్టవనున్నాయి. కొత్తగా వస్తున్న ఐపీఓలు మెయిన్బోర్డు విభాగంలో B2B ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ క్రిజాక్, ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ సంస్థలు ఐపీఓలుగా రానున్నాయి. ఎస్ఎంఈ కేటగిరీలో సిల్కీ ఓవర్సీస్, పుష్ప జువెలర్స్, సెడార్ టెక్స్టైల్, మార్క్ లోయిర్ ఫ్యాషన్స్, వందన్ ఫుడ్స్ సంస్థలు బహిరంగ ఎష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే, మార్కెట్లో లిస్టింగ్ల ఉత్సాహంతోపాటు, కొత్త ఐపీఓలపై కూడా ఉత్సుకత నెలకొంది. పెట్టుబడిదారుల శ్రద్ధను ఆకర్షించడంలో ఈ కంపెనీలు ఎంతవరకూ విజయవంతమవుతాయో చూడాలి.