Tata Technologies IPO : 20 సంవత్సరాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. సబ్స్కిప్షన్ ఎప్పటినుంచంటే!
దేశంలో ఎంతో నమ్మకమైన బ్రాండ్గా టాటా (TATA) గ్రూప్ నిలిచింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ నుంచి ఓ ఐపీఓ వస్తోంది. దీనికోసం ఇన్వెస్టర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపీఓ సబ్ స్క్రీప్షన్ తేదీని కూడా ప్రకటించింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) కోసం స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లు కళ్లు కాయలు కాచేలా వేచి ఉన్నారు. అయితే టాటా టెక్నాలజీస్ ఐపీఓ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఎదురుచూపులకు టాటా గ్రూప్ తెరదించింది. టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభం కాబోతోంది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది
అర్హులైన షేర్ హోల్డర్లకు 10 శాతం కేటాయింపు
ఇందులో మొత్తంగా 60,850,278 ఈక్విటీ షేర్లు ఇష్యూ చేస్తున్నామని, అందులో కంపెనీ నుంచి 46, 275, 000 ఈక్విటీ షేర్లు ఉన్నాయని టాటా పేర్కొంది. ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ నుంచి 9, 716, 853 ఈక్విటీ షేర్లు, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ నుంచి 4, 858, 425 షేర్లు ఉన్నాయన్నారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్ క్యాపిటల్లో వాటి విలువ 11. 41 శాతం, 2. 40 శాతం, 1. 20 శాతంగా ఉందని కంపెనీ నవంబర్ 13న ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో స్పష్టం చేసింది. ఇక ఈ ఐపీఓలో టాటా మోటార్స్ లిమిటెడ్కు చెందిన అర్హులైన షేర్ హోల్డర్లకు 10 శాతం కేటాయించినట్లు తెలుస్తోంది.