LOADING...
Stock market: ఐదో రోజూ మార్కెట్ జోష్‌.. సెన్సెక్స్‌, నిఫ్టీకి మరోసారి లాభాల మోత!
ఐదో రోజూ మార్కెట్ జోష్‌.. సెన్సెక్స్‌, నిఫ్టీకి మరోసారి లాభాల మోత!

Stock market: ఐదో రోజూ మార్కెట్ జోష్‌.. సెన్సెక్స్‌, నిఫ్టీకి మరోసారి లాభాల మోత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, మెటల్‌, రియల్టీ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా నిలిచాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో వచ్చిన కొనుగోళ్ల మద్దతు మార్కెట్‌కు అదనపు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకుపైగా లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,100 పాయింట్ల స్థాయికి ఎగువన ముగిసింది. ఉదయం 77,131.66 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ (గత ముగింపు: 77,155.62) ఇంట్రాడేలో 77,492.33 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

వివరాలు

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.94.34

చివరికి 254.36 పాయింట్లు పెరిగి 77,409.98 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 82.30 పాయింట్లు లాభపడి 24,168 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.94.34గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇండిగో, ట్రెంట్‌, బీఈఎల్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా లాభపడగా, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 77 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,268 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement