Loading...
Shabnam Sinha: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..
ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..

Shabnam Sinha: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్‌ టెల్ పేమెంట్స్ బ్యాంక్ అగ్ర నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న సునీల్ భారతీ మిట్టల్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో షబ్నమ్ సిన్హా కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆమె ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతికి అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది.

వివరాలు 

సెప్టెంబర్ 30తో మిట్టల్ పదవీకాలం ముగింపు

సునీల్ మిట్టల్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలగనున్నారు.

దీంతో 2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఆయన పదేళ్ల సుదీర్ఘ పదవీకాలం ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి షబ్నమ్ సిన్హా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ హోదాలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

ఆమె నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా విస్తరించగలమని సంస్థ అంచనా వేస్తోంది.

వివరాలు 

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం

షబ్నమ్ సిన్హాకు డెవలప్‌మెంట్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పబ్లిక్ పాలసీ, ఇన్‌స్టిట్యూషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

గతంలో ఆమె ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఆ సమయంలో ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అంశాల్లో సలహాలు అందించారు.

ఈ బాధ్యతల్లో అనేక మెరుగైన ఫలితాలను సాధించారు.

ADVERTISEMENT

వివరాలు 

టెక్నాలజీ, రిస్క్ కమిటీల్లో కీలక పాత్ర

ప్రస్తుతం షబ్నమ్ సిన్హా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు.

అదే సమయంలో రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ కమిటీల్లోనూ క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

బ్యాంకింగ్, టెక్నాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ఆమెకు ఉన్న విస్తృత అనుభవం భవిష్యత్తులో బ్యాంక్ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.

ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చేపట్టే భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడంలో ఆమె అనుభవం కీలకంగా మారుతుందని చెబుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

డిజిటల్ బ్యాంకింగ్‌లో కీలక స్థానం

సునీల్ మిట్టల్ నాయకత్వంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారత డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్థగా ఎదిగింది.

ప్రస్తుతం వార్షిక ఆదాయం పరంగా దేశంలోనే అతిపెద్ద పేమెంట్స్ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.

దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్‌కు 12.1కోట్లకు పైగా మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అలాగే దాదాపు మూడు కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను కూడా బ్యాంక్ విస్తరించింది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి నాలుగు గ్రామాల్లో మూడింటికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.

కొత్త చైర్‌పర్సన్‌గా షబ్నమ్ సిన్హా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణతో పాటు సాంకేతికత,రిస్క్ మేనేజ్‌మెంట్, సైబర్ భద్రతకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT