LOADING...
Tata Trusts: టాటా ట్రస్ట్స్‌ నిర్ణయంపై మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభం..!
టాటా ట్రస్ట్స్‌ నిర్ణయంపై మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభం..!

Tata Trusts: టాటా ట్రస్ట్స్‌ నిర్ణయంపై మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు మరింతగా ఉధృతమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీ (Mehli Mistry)ని జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించాలన్న ప్రతిపాదనకు ఇటీవల టాటా ట్రస్ట్స్‌ (Tata Trusts) ఆమోదం లభించలేదు. ఈ పరిణామంపై ఇప్పుడు మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభించినట్లు సమాచారం. టాటా ట్రస్ట్స్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన ముంబయి ఛారిటీ కమిషనర్‌ ఎదుట సవాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయన కేవియెట్‌ (Caveat) కూడా దాఖలు చేసినట్టు పలు ఆంగ్ల వార్తామాధ్యమాలు వెల్లడించాయి.

వివరాలు 

మెహ్లీ పునర్నియామకానికి లభించని ఆమోదం

ఇదిలా ఉండగా, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ (SRTT), సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (SDTT), బాయి హీరాబాయి జంషెడ్జీ టాటా నవ్సారి చారిటబుల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లకు మెహ్లీ మిస్త్రీని పునర్నియమించేందుకు టాటా ట్రస్ట్స్‌ సీఈఓ ఇటీవల ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ట్రస్టీలు నోయల్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌, విజయ్‌ సింగ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రస్టీలలో మెజార్టీ మద్దతు లభించకపోవడంతో, మెహ్లీ మిస్త్రీ జీవితకాల ట్రస్టీగా పునర్నియామకం నిలిచిపోయినట్టైంది.