NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Code by Bots: మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Code by Bots: మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
    మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    Code by Bots: మెటా AI మానవ ఇంజనీర్లను అధిగమిస్తుంది.. జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది.

    అనేక రంగాల్లో ఇది వేగంగా విస్తరిస్తుండటంతో, భవిష్యత్తులో ప్రతిదీ ఏఐ ఆధారితమవుతుందన్న భావన బలపడుతోంది.

    ఈ నేపథ్యంలో, మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

    లామా ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలావరకు కోడింగ్‌ను ఏఐయే పూర్తిచేస్తుందని జుకర్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

     12 నుంచి 18 నెలల్లో ప్రధాన కోడింగ్ పనులు పూర్తిగా ఏఐచేత 

    తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్, మెటాలో కృత్రిమ మేధ వాడకంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

    ఇప్పటికే ఏఐ ఒక బృంద సభ్యుడిలా పనిచేస్తోందని చెప్పారు. త్వరలోనే అత్యుత్తమ కోడర్లకంటే మెరుగ్గా ఏఐ పనిచేస్తుందని పేర్కొన్నారు.

    మీరు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశిస్తే, ఆ పని తక్కువ సమయానికే సమర్థవంతంగా పూర్తి చేయగలదని చెప్పారు.

    బగ్‌లను గుర్తించడంలోనూ, నాణ్యమైన కోడ్‌ను స్వయంగా తయారు చేయడంలోనూ ఏఐకు ఎంతో సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు.

    ప్రత్యేకించి, మెటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న 'లామా ప్రాజెక్ట్‌'లో రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రధాన కోడింగ్ పనులు పూర్తిగా ఏఐచేత జరగనున్నాయని చెప్పారు.

    వివరాలు 

     కృత్రిమ మేధ పాత్ర కీలకం

    కేవలం మెటా మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఏఐపై ఇదే ధోరణి చూపిస్తున్నాయి.

    ఇటీవల మెటా లామా ఏఐ డెవలపర్ ఈవెంట్‌లో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, తమ కంపెనీలో 20 నుంచి 30 శాతం కోడ్‌ను ఇప్పటికే కృత్రిమ మేధతో తయారుచేస్తున్నామని తెలిపారు.

    నాణ్యత పెంచేందుకు ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువవుతోందని చెప్పారు.

    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు.

    గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ కోడ్ తయారీలో కృత్రిమ మేధ పాత్ర దాదాపుగా కీలకంగా మారిందని చెప్పారు.

    ఏఐ రూపొందించిన కోడ్‌ను ఇంజినీర్లు పరిశీలిస్తున్నప్పటికీ, దాని వినియోగం పెద్దఎత్తున పెరిగిందని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మార్క్ జూకర్ బర్గ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మార్క్ జూకర్ బర్గ్

    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా మెటా
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం మెటా
    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు ఇన్‌స్టాగ్రామ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025