LOADING...
MS Dhoni Invests: ఏఐ రంగంలోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ.. 'కుకు'లో ఇన్వెస్ట్‌మెంట్!
ఏఐ రంగంలోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ.. 'కుకు'లో ఇన్వెస్ట్‌మెంట్!

MS Dhoni Invests: ఏఐ రంగంలోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ.. 'కుకు'లో ఇన్వెస్ట్‌మెంట్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో ప్రముఖ స్థానం సంపాదించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మరో కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే మొబైల్ స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్ 'కుకు' (Kuku) లో ఆయన పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ 'కుకు టీవీ' (Kuku TV) కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన ఖచ్చితమైన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

వివరాలు 

వారు ఆ స్థాయికి రావడం గర్వంగా ఉందన్న ధోనీ

ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. చిన్న పట్టణాల నుంచి వచ్చిన వ్యవస్థాపకులు ఈ స్థాయికి ఎదగడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. భారతదేశం నుంచే ప్రపంచ స్థాయికి ఎదిగేలా ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనే వారి లక్ష్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. 2018లో లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ కుమార్ మీనా కలిసి ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 'కుకు టీవీ' (మైక్రో డ్రామాలు), 'కుకు ఎఫ్‌ఎమ్' (ఆడియో కథలు) వంటి పలు యాప్‌లను నిర్వహిస్తోంది.

వివరాలు 

7 భాషల్లో 'కుకు' సేవలు

భారతదేశంలో మైక్రో డ్రామా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ రంగం విలువ 300 మిలియన్ డాలర్లను దాటగా, 2026 చివరి నాటికి ఇది సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కుకు సంస్థకు 350 మిలియన్లకు పైగా ఇన్‌స్టాల్స్ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో 7 భాషల్లో 20 వేలకుపైగా టైటిల్స్ అందుబాటులో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ సంస్థ 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్' (IIZ) అనే హిందీ సినిమాతో థియేటర్ రంగంలోకి కూడా ప్రవేశించింది.

Advertisement

వివరాలు 

85 మిలియన్ డాలర్ల నికర నిధులు

బెంగళూరును కేంద్రంగా చేసుకుని కుకు కంపెనీ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ స్టార్టప్, అక్టోబర్ 2025లో గ్రానైట్ ఆసియా ఆధ్వర్యంలో సుమారు 85 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ధోని వంటి ప్రముఖ వ్యక్తి సంస్థతో కలవడం వల్ల కంపెనీ మరింత బలపడుతుందని వ్యవస్థాపకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మైథాలజీ-ఫాంటసీ, సూపర్ హీరో నేపథ్యాలతో కూడిన ఏఐ ఆధారిత ఒరిజినల్ మైక్రో డ్రామాలను విడుదల చేసి సంస్థ మరింత వేగంగా ముందుకు సాగుతోంది.

Advertisement