NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
    తదుపరి వార్తా కథనం
    Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
    దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

    Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది.

    దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది నవంబర్ 1న జరుగుతుందని స్పష్టం చేసింది.

    దీంతో నవంబర్ 1, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ముహురత్ ట్రేడింగ్ 2024 జరుగనుంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్‌ఈ) ఈ అంశంపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

    అయితే వారు కూడా నవంబర్ 1న ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

    ఈ సెషన్ దీపావళి సందర్భంగా ప్రారంభమయ్యే హిందూ క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించింది.

    Details

    ఈ సెషన్ ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనాలు

    'ముహురత్' అంటే శుభ సమయం, ఇందులో ట్రేడింగ్ చేయడం ద్వారా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు పొందుతారనే నమ్మకం ఉంది.

    సాధారణంగా, పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉంటాయి. అయితే దీపావళి సందర్భంగా ముహురత్ ట్రేడింగ్ కోసం సాయంత్రం గంట పాటు ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తారు.

    నవంబర్ 1న సాయంత్రం 5.45 నుంచి 6.00 గంటల వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ జరుగుతుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొత్త వెంచర్లను ప్రారంభించేందుకు అనువైన సమయంగా భావిస్తారు.

    ఈ సెషన్ ద్వారా వారు ఏడాది పొడవునా ప్రయోజనాలను పొందుతారని భావిస్తారు.

    Details

    ట్రేడింగ్ లో ఓ గంటపాటు అస్థిరంగా మార్కెట్లు

    కేవలం ఒక గంట ట్రేడింగ్‌తో మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి.

    కాబట్టి లాభ-నష్టం విషయాలపై పెద్దగా ఆలోచించరు. గత 17 ప్రత్యేక సెషన్లలో 13 సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియడం, ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను అందించాయి.

    ఇక 2008లో, సెన్సెక్స్ ఒక గంట సెషన్‌లో 5.86 శాతం పెరగడం విశేషం. భారతదేశంలో, దీపావళి సమయంలో స్టాక్ బ్రోకర్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు.

    ఈ సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడం ద్వారా రాబోయే సంవత్సరానికి శ్రేయస్సు తీసుకురావాలని చూస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దీపావళి
    వ్యాపారం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం
    Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా  లైఫ్-స్టైల్
    Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ రియల్ మీ

    వ్యాపారం

    Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది! ఇటలీ
    Cisco layoffs: సిస్కో కంపెనీలో లేఆఫ్స్.. వేలాది మందిపై వేటు  ఉద్యోగుల తొలగింపు
    Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు రాఖీ పండగ
    Spice Samples: భారతదేశంలో మసాలా శాంపిల్స్ నాణ్యత పరీక్ష.. 12% విఫలం   బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025