Banking: ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు.. UPI విత్డ్రాయల్స్, ఛార్జీలు, పరిమితులపై పెద్ద మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మార్గదర్శకాలతో పాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల విధానాలను సవరించాయి. ముఖ్యంగా యూపీఐ, ఏటీఎం ఉపసంహరణలు, ఛార్జీల విషయంలో వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మార్పులు ఇవి.
వివరాలు
యూపీఐతో ఏటీఎం నగదు ఉపసంహరణకు ఛార్జీలు
ఇప్పటి వరకు ఏటీఎంలలో కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకునే సదుపాయం చాలా మంది వినియోగించారు. ఈ సేవను కొంతమంది బ్యాంకులు ఉచితంగా లేదా అదనపు లావాదేవీగా పరిగణించేవి. అయితే, ఏప్రిల్ 1 నుంచి ఈ విధానంలో కీలక మార్పు వస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఇకపై యూపీఐ ఆధారిత ఏటీఎం నగదు ఉపసంహరణలను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలలో భాగంగా పరిగణించనున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత: ప్రతి యూపీఐ విత్డ్రాయల్పై రూ.23 అదనంగా వర్తించే పన్నులు చెల్లించాలి
వివరాలు
రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి తగ్గింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని సగానికి తగ్గించింది. కొత్త పరిమితులు: పాత పరిమితి: రూ.1,00,000 కొత్త పరిమితి: రూ.50,000 ఇది పెద్ద మొత్తంలో నగదు తీసుకునే వారికి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల వినియోగంపై ఛార్జీలు బంధన్ బ్యాంక్ ఖాతాదారులకు కూడా ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సొంత ఏటీఎంలలో: నెలకు 5 ఉచిత లావాదేవీలు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో (మెట్రో నగరాలు): 3 ఉచిత లావాదేవీలు మాత్రమే పరిమితి దాటితే: ప్రతి లావాదేవీకి రూ.10 ఛార్జ్
వివరాలు
డిజిటల్ చెల్లింపులకు ద్వంద్వ భద్రత తప్పనిసరి
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు భద్రతను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇకపై డిజిటల్ చెల్లింపులకు కేవలం ఓటీపీ సరిపోదు. కొత్త భద్రతా విధానం: ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి దీనివల్ల ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం అవుతాయి అలాగే, బ్యాంక్ యాప్లలో తరచూ బ్యాలెన్స్ చెక్ చేసే వినియోగదారులకు నామమాత్రపు ఛార్జీలు విధించే అవకాశముంది.