NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!
    కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!

    SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 26, 2025
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈసారి బడ్జెట్లో పాత ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలోని అన్ని రాయితీలను తొలగించి, పూర్తిగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది.

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న నూతన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో దేశంలో మధ్యతరగతి ప్రజల నుంచి ఇతర వర్గాల నుండి వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ రీసెర్చ్ సూచించింది.

    అలాగే ఆదాయపు పన్ను విధానాన్ని మరింత హేతుబద్ధం చేయాలని ప్రతిపాదించింది.

    Details

    ఎస్‌బీఐ రీసెర్చ్‌ చేసిన ప్రతిపాదనలు 

    ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్)

    మినహాయింపు పరిమితిని రూ.50,000 నుండి రూ.1 లక్షకు పెంచాలి.

    సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.25,000 నుండి రూ.50,000కు పెంచాలి.

    రూ.10-15 లక్షల మధ్య ఆదాయంపై పన్ను భారాన్ని 15శాతానికి తగ్గించాలి.

    అన్ని రకాలైన కాలపరిమితి కల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీకి 15శాతం పన్ను మాత్రమే వసూలు చేయాలి.

    వడ్డీ ఆదాయాన్ని ఇతర ఆదాయంగా పరిగణించాలి. సేవింగ్ ఖాతాలపై వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.20వేలకు పెంచాలి.

    Details

    ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు కొనుగోలు శక్తి తగ్గనుంది

    ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల మేర ఆదాయం తగ్గిపోతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది జీడీపీలో 0.14శాతానికి సమానం.

    అయితే దీనివల్ల పన్ను చెల్లింపులు పెరిగి, ప్రజల వద్ద ఆదాయం పెరిగి వినియోగం కూడా పెరుగుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు.

    అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది.

    దీని పరిష్కారం పన్ను భారాన్ని తగ్గించడం కావాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Details

    రంగాల వారీగా సూచనలు 

    మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు, టాక్స్‌ ఫ్రీ బాండ్లు, ట్యాక్స్‌ పెయిడ్‌ బాండ్లను జారీ చేసే అవకాశం కల్పించాలని చూస్తోంది.

    వ్యవసాయ రంగానికి మేలు చేసే విధంగా క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ట్రస్ట్‌, ఎంఎస్‌ఎంఈ విభాగానికి పీఎల్‌ఐ స్కీము అమలు చేయనున్నారు.

    ఆర్థిక లోటు అంశంపై ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా 2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును 4.5శాతానికి పరిమితం చేయాలని సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్
    ఎస్‌బీఐ

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు ఆర్ధికవేత్త
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి ఆర్థిక సంవత్సరం
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ

    ఎస్‌బీఐ

    SBI: ఎస్‌బీఐలో 10,000 కొత్త ఉద్యోగాలు.. మార్చి 2024 లోపు నియామకాలు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025