Page Loader
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1064, నిఫ్టీ 322 పాయింట్లు చొప్పున నష్టం 
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1064, నిఫ్టీ 322 పాయింట్లు చొప్పున నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2024
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 81,511.81 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 81,748.57) నష్టాలతో ప్రారంభమై రోజంతా అదే నెగటివ్‌ ట్రెండ్‌ను కొనసాగించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ కనిష్ఠంగా 80,612.20 పాయింట్లను తాకింది. చివరికి 1,064 పాయింట్ల భారీ నష్టంతో 80,684 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 322 పాయింట్లు కోల్పోయి 24,336 వద్ద స్థిరపడింది.

వివరాలు 

 లాభాలను నమోదు చేసిన ఐటీసీ  

సెన్సెక్స్-30 సూచీలో ఐటీసీ మాత్రమే లాభాలను నమోదు చేయగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.56 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ధర ఔన్సుకు 2,655.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.