Page Loader
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800 
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠాల వద్ద మదుపర్లు చేసిన కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది. దీని ఫలితంగా నేటి ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 23,800 స్థాయికి పైగా కదలాడింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 78,806 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,854 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్,టాటా మోటార్స్, జొమాటో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 2,652.70 డాలర్లు 

అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్,టైటాన్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 2,652.70 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 85.34 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా షేర్లను విక్రయిస్తూనే ఉన్నారు. గురువారం కూడా వారు నికరంగా రూ.2,377 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇక, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,336 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.