Page Loader
EaseMyTrip: ఈజ్‌మై ట్రిప్‌ ప్లానర్స్‌ సీఈఓ నిశాంత్‌ పిట్టి రాజీనామా
ఈజ్‌మై ట్రిప్‌ ప్లానర్స్‌ సీఈఓ నిశాంత్‌ పిట్టి రాజీనామా

EaseMyTrip: ఈజ్‌మై ట్రిప్‌ ప్లానర్స్‌ సీఈఓ నిశాంత్‌ పిట్టి రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) మాతృసంస్థ అయిన ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సీఈఓ నిశాంత్ పిట్టి తన పదవికి రాజీనామా చేశారు. నిశాంత్ పిట్టి, కో-ప్రమోటర్లలో ఒకరైన ఆయన, వ్యక్తిగత కారణాలతో 2025 జనవరి 1న తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అదే తేదీన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తన సోదరుడు రికాంత్ పిట్టిని సీఈఓగా కంపెనీ నియమించింది. ఈ వివరాలను సంస్థ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది.

వివరాలు 

 నష్టాల్లోకి కంపెనీ షేర్లు

నిశాంత్ పిట్టి 2008లో కంపెనీ బోర్డులో చేరారు. గత ఏడాది మేలో ఆయన్ని ఐదేళ్ల కాలానికి తిరిగి బోర్డులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న నిశాంత్ పిట్టి ఓపెన్ మార్కెట్ ద్వారా 1.4 శాతం వాటాను విక్రయించారు. వాటాను తగ్గించిన మరుసటి రోజే పదవికి రాజీనామా చేయడం విశేషంగా మారింది. ఈ పరిణామాల ప్రభావంతో కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ.15.77 వద్ద ట్రేడవుతున్నాయి.