NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 
    ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్

    ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 27, 2023
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.

    ఇనుప ఖనిజాల తవ్వకంలో ఎంతో అనుభవం ఉన్న ఎన్ఎండీసీ సంస్థ బంగారం మైన్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి.

    చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌ను త్వరలోనే ఎన్‌ఎండీసీ లీజుకు తీసుకోనుంది.

    గత ఏడాది చివరలోనే ఈ మైనింగ్ ఒప్పందానికి సంబంధించిన ఇంటెంట్ లెటర్‌పై ఎన్ఎండీసీ సంతకం చేసింది.

    ఇంటెంట్ లెటర్‌పై సంతకం చేసిన మూడు సంవత్సరాలలోపు గోల్డ్ బ్లాక్ మైనింగ్ లీజును పొందాల్సి ఉంటుంది.

    ఈ క్రమంలో లీజు ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఎన్‌ఎండీసీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

    బంగారం

    చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌లో 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు 

    చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌‌లో తవ్వకాల కోసం ఎన్‌ఎండీసీ రూ.500కోట్ల (61 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    ఈ బ్లాక్‌లో దాదాపు 1.83 మిలియన్ టన్నుల బంగారం ఖనిజం నిల్వలు ఉన్నాయని, టన్నుకు 5.15 గ్రాముల బంగారం వస్తుందని గతంలో సర్వే చేసిన సంస్థలు తెలిపాయి.

    పర్యావరణ అనుమతులు వంటి ప్రభుత్వ అనుమతులను పొందడంలో సహాయపడటానికి ఒక కన్సల్టెంట్‌ను నియమించాలని ఎన్ఎండీసీ భావిస్తోంది.

    చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని వినియోగిస్తున్న దేశం భారత్. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగల్లో బంగారం తప్పనిసరిగా వినియోగిస్తారు. అందుకే దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

    బంగారం డిమాండ్‌లో 90శాతం కంటే ఎక్కువ దిగమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చిత్తూరు
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో ! విద్యా శాఖ మంత్రి
    పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం పవన్ కళ్యాణ్

    చిత్తూరు

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా వార్తలు

    బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్  వైట్‌హౌస్
    భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట  ఫ్రాన్స్
    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025