NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / FICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్‌ టైం' మోసాలపై ఫికో నివేదిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    FICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్‌ టైం' మోసాలపై ఫికో నివేదిక
    రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్‌ టైం' మోసాలపై ఫికో నివేదిక

    FICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్‌ టైం' మోసాలపై ఫికో నివేదిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    09:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రియల్ టైమ్ చెల్లింపుల (ఆర్‌టీపీ) సమయంలో మోసాలకు గురై డబ్బులు కోల్పోయినట్లు 33% మందికి పైగా ఒక సర్వేలో వెల్లడించారు.

    ఇది దేశంలో రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థలో మోసాల ముప్పు పెరుగుతోందని సూచిస్తుంది.

    ఈ సర్వేను అంతర్జాతీయ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫికో 2024లో నిర్వహించింది.

    ఇందులో భారతదేశానికి చెందిన 1,000 మంది సహా, 14 దేశాల నుంచి మొత్తం 11,000 మంది వినియోగదారులు పాల్గొన్నారు.

    ఫికో ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ దత్తు కొంపెల్ల మాట్లాడుతూ, రియల్ టైమ్ చెల్లింపులు భవిష్యత్తులో మరింత పెరుగుతాయని, అలాగే వినియోగదారులు, వ్యాపారులు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మరిన్ని లావాదేవీలు జరుగవచ్చని చెప్పారు.

    వివరాలు 

    సర్వే నివేదిక వివరాలు ఇలా..

    స్కామర్ల ద్వారా వచ్చే సందేశాల వల్ల మోసాలకు గురయ్యే అవకాశాలు అధికమని 60% మంది తెలిపారు.

    ఈ విధంగా తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు డబ్బులు పోగొట్టుకున్నట్లు 54% మంది వెల్లడించారు.

    తమకు సరఫరా కాని వస్తువులు లేదా సేవలకు చెల్లింపులు చేసినట్లు 34% మంది తెలిపారు.

    2023తో పోలిస్తే 2024లో మోసాలపై ఫిర్యాదు చేసిన భారత వినియోగదార్ల సంఖ్య తగ్గినప్పటికీ, పెద్ద మొత్తంలో (₹8 లక్షలకు పైగా) నష్టపోయిన వారి సంఖ్య 2% నుంచి 4% కు పెరిగింది.

    వివరాలు 

    సర్వే నివేదిక వివరాలు ఇలా..

    ₹50,000 లోపు నష్టపోయిన వారి శాతం 56%గా ఉంది. అయితే, ఈ మొత్తం తక్కువగానే కనిపించినా, చాలా కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపిస్తోందని నివేదిక పేర్కొంది.

    45% మంది అభిప్రాయం ప్రకారం, వినియోగదారులను మోసాల బారినుంచి కాపాడేందుకు బ్యాంకులు మోసాల గుర్తింపు వ్యవస్థలను మెరుగుపరచడం చాలా అవసరం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వ్యాపారం

    Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత  ఇండియా
    Mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఏ వయసులో లాభాలు వస్తాయంటే?  ఇండియా
    Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ స్టాక్ మార్కెట్
    How to become rich: చిన్న వయసులోనే రిటైర్‌ అయ్యి హాయిగా జీవించాలనుకుంటున్నారా? ఈ అలవాట్లు ఉండాల్సిందే!  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025