Page Loader
ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం
ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం

ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2023
07:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఇపే మినీ స్థానంలో ఆర్‌. దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నూతన ఎండీగా నియమించింది. దొరైస్వామి ప్రస్తుతం ముంబయిలోని ఎల్‌ఐసీ సెంట్రల్‌ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 2023 సెప్టెంబర్‌ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు లేదా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎండీగా కొనసాగుతారని ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లకు హెడ్‌హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) జూన్‌లో దొరైస్వామి పేరును ఎండీగా సిఫార్సు చేసింది. FSIBకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మాజీ సెక్రటరీ భాను ప్రతాప్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి