Page Loader
RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం

RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌ బి ఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించారు. రెపో రేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.

వివరాలు 

శక్తికాంత దాస్‌ ప్రసంగంలో కీలక అంశాలివే..

2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 7.2శాతంగా అంచనా వేయబడింది.రెండో త్రైమాసికంలో 7శాతం, మూడు,నాలుగో త్రైమాసికంలో 7.4శాతంగా ఉండే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన తొలి క్వార్టర్‌లో 7.3శాతంగా వృద్ధి రేటు అంచనా వేయబడింది. ఈ ఏడాది చివరికి మెరుగైన వర్షపాతం,సరిపడా నిల్వలతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా పెరగవచ్చని అంచనా వేయబడింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండే అవకాశం ఉంది. తయారీ ఖర్చులు తగ్గడం,ప్రభుత్వ విధానాలు,దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ వంటి కారణాల వల్ల తయారీ రంగం వృద్ధి చెందుతోంది.ఆర్థిక రంగం స్థిరంగా ఉంది.బ్యాంకుల కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. యూపీఐలైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.2000 నుంచి రూ.5,000కు పెంచడం జరిగింది.