LOADING...
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.56.44 కోట్ల జరిమానా.. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్న కంపెనీ 
ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్న కంపెనీ

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.56.44 కోట్ల జరిమానా.. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్న కంపెనీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లో పనిచేస్తున్న సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) జాయింట్ కమిషనర్, కంపెనీపై రూ.56.44 కోట్ల మేర ఆర్థిక జరిమానా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ (ITC) సంబంధిత అంశాలపై ఈ శిక్ష విధించినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాము అప్పీల్ దాఖలు చేయనున్నామని రిలయన్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా తెలియజేసింది. ఈ నెల 25న జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు, గురువారం ఉదయం 11:04 గంటలకు తమకు ఈ-మెయిల్ ద్వారా చేరాయని కంపెనీ తెలిపింది.

వివరాలు 

ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపిన రిలయన్స్ 

2017 నాటి సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 74 ప్రకారం ఈ పెనాల్టీ విధించబడింది. ఇదిలా ఉండగా, జీఎస్టీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని రిలయన్స్ ఖండించింది. సేవల ప్రదాత అందించిన సేవల వర్గీకరణను పరిగణలోకి తీసుకోకుండా, అధికారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను 'బ్లాక్డ్ క్రెడిట్'గా భావించి ఈ ఉత్తర్వులు జారీ చేశారని కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగా, ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లాలని తాము నిర్ణయించుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

Advertisement