LOADING...
Reliance: భారత్‌లో మెటా తొలి AI డేటా సెంటర్.. రిలయన్స్‌తో భారీ ఒప్పందం.. జామ్‌నగర్‌లో ఏర్పాటు!
రిలయన్స్‌తో భారీ ఒప్పందం.. జామ్‌నగర్‌లో ఏర్పాటు!

Reliance: భారత్‌లో మెటా తొలి AI డేటా సెంటర్.. రిలయన్స్‌తో భారీ ఒప్పందం.. జామ్‌నగర్‌లో ఏర్పాటు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) భారత్‌లో తన తొలి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)తో చేతులు కలిపింది. దేశంలో AI మౌలిక సదుపాయాలను విస్తరించడంలో భాగంగా ఈ కీలక ప్రాజెక్టును చేపడుతోంది. జామ్‌నగర్‌లో నిర్మాణం.. 168 మెగావాట్ల సామర్థ్యం ఈ AI డేటా సెంటర్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 168 మెగావాట్ల (MW) సామర్థ్యంతో దీనిని నిర్మిస్తారు. ఒప్పందం ప్రకారం ఈ డేటా సెంటర్ నిర్మాణ బాధ్యతలను రిలయన్స్ చేపడుతుంది. అనంతరం మెటా దానిని లీజుకు తీసుకుని నిర్వహించనుంది. భవిష్యత్తులో అవసరాలను బట్టి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం కూడా మెటాకు ఉంటుంది.

వివరాలు 

భారత్‌లో AI విస్తరణకు కీలక అడుగు

రిలయన్స్‌తో ఈ భాగస్వామ్యం మెటా AI వ్యూహంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచంలో మెటాకు అత్యంత కీలక మార్కెట్లలో భారత్ ఒకటి. ప్రస్తుతం AI మోడళ్లు, క్లౌడ్ సేవలు, భారీ స్థాయిలో డేటా ప్రాసెసింగ్ అవసరాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ టెక్ దిగ్గజాలు AI మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లో విస్తారమైన వినియోగదారుల సంఖ్య, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇలాంటి పెట్టుబడులకు అనువైన దేశంగా మారిందని మెటా వెల్లడించింది.

వివరాలు 

2025లో ఇరు సంస్థలు సంయుక్తంగా ఒక వెంచర్‌ ఏర్పాటు

మెటా, రిలయన్స్ కలిసి AI రంగంలో పనిచేయడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఆగస్టులో భారతీయ వ్యాపార సంస్థల కోసం AI ప్లాట్‌ఫారమ్‌లు, టూల్స్ అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో మెటా రూపొందించిన లామా (Llama) AI మోడళ్లను వినియోగించాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టులో ప్రారంభంగా రూ.855 కోట్ల పెట్టుబడి పెట్టగా, రిలయన్స్‌కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా ఉంది.

Advertisement

వివరాలు 

మరింత బలపడుతున్న మెటా-రిలయన్స్ అనుబంధం

తాజా డేటా సెంటర్ ఒప్పందం మెటా, రిలయన్స్ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2020లో రిలయన్స్ డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో మెటా 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. భారత టెక్నాలజీ రంగంలో జరిగిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఆ భాగస్వామ్యం మొదట డిజిటల్ సేవలతో ప్రారంభమై, తర్వాత AI టెక్నాలజీల వరకు విస్తరించింది. ఇప్పుడు భారీ స్థాయి AI డేటా మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేరుకోవడం విశేషంగా మారింది.

Advertisement