Page Loader
SBI: డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ.. ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్బీఐ
డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ.. ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్బీఐ

SBI: డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ.. ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్బీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది. తాజా మార్పులు 2025 ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ఈ పరిష్కారంలో భాగంగా, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్య కాలవ్యవధి కలిగిన డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ తగ్గింపు సాధారణ ఖాతాదారులు, వృద్ధ పౌరులందరికీ వర్తిస్తుంది. ఈ మార్పులతో పాటు,ఎస్‌బీఐ తన ప్రత్యేక ఎఫ్‌డి పథకం అయిన 'అమృత్ వృష్టి'ను 444 రోజుల కాలవ్యవధికి తిరిగి ప్రవేశపెట్టింది.

వివరాలు 

కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు 

ఇది కొత్తగా సవరించిన వడ్డీ రేట్లతో అందుబాటులోకి రానుంది. కాగా, దీన్నికంటే ముందే అమలులో ఉన్న 'అమృత్ కలశ్' పేరుగల ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని బ్యాంక్ నిలిపివేసింది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఇందుకు ముందు కూడా ఫిబ్రవరిలో ఇదే స్థాయిలో తగ్గించడంతో మొత్తం రెపో రేటు 6.50 శాతం నుంచి 6 శాతానికి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో, బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావంగా డిపాజిట్‌లపై కూడా వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నారు.

వివరాలు 

ఎస్‌బీఐ అమృత్ వృష్టి పథకం వివరాలు 

వడ్డీ రేట్ల మార్పుల తరువాత,ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్యకాలం ఉన్న డిపాజిట్‌లపై 3.50 శాతం నుంచి 6.9 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. వృద్ధ పౌరుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఎస్‌బీఐ వీకేర్' పథకంతో కలిపి 4 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ తన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం అయిన "అమృత్ వృష్టి"ను మరోసారి ప్రవేశపెట్టింది. ఇది 444 రోజుల ఖచ్చిత కాలవ్యవధి కలిగిన డిపాజిట్ పథకం.గతంలో పోలిస్తే,ఈ పథకంపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం.

వివరాలు 

సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.65 శాతం వడ్డీ

ఇతర సాధారణ మధ్యకాలిక డిపాజిట్‌లకు కేవలం 10బేసిస్ పాయింట్ల మేర మాత్రమే తగ్గించగా, అత్యధిక వడ్డీ లభించే ఈ ప్రత్యేక పథకం కూడా ఇక కొంతమేర ఆకర్షణ కోల్పోయే అవకాశం ఉంది. ఈ పథకం 2025, ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం, సాధారణ ఖాతాదారులకు సంవత్సరానికి 7.05 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. వృద్ధ పౌరులకు ఇది 7.55 శాతం కాగా, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.65 శాతం వడ్డీ లభించనుంది.

వివరాలు 

5 లక్షలపై ఎంతొస్తుంది?

గతంలో ఇదే పథకం ద్వారా సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం వడ్డీ లభించేది. వృద్ధులకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీగా ఇస్తుండడంతో వారికి 7.75 శాతం వడ్డీ రేటు లభించేది. తాజా వడ్డీ ప్రకారంగా, రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, సాధారణ ఖాతాదారులకు 444 రోజుల కాలానికి ₹44,365 వడ్డీ లభిస్తోంది. అదే డిపాజిట్‌కు వృద్ధ పౌరులకు ₹47,626 వడ్డీ వస్తోంది. ఇక సూపర్ సీనియర్ పౌరులకు 7.65 శాతం వడ్డీ రేటు ప్రకారం ₹48,280 వడ్డీగా లభిస్తుంది.