Stock market: వరుస నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. ఐటీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ఐటీ, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 2 శాతం వరకు క్షీణించాయి. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లో నష్టపోగా.. నిఫ్టీ వరుసగా ఆరో రోజు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,418.97 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. గత సెషన్లో ఈ సూచీ 77,728.16 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఎక్కువగా నష్టాల్లోనే కొనసాగింది.
వివరాలు
సెన్సెక్స్ 30
ఇంట్రాడేలో ఒక దశలో 77,234.36 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 492.70 పాయింట్లు కోల్పోయి 77,235.46 వద్ద స్థిరపడింది.
మరోవైపు నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసింది. 132.75 పాయింట్లు దిగజారి 24,154.90 వద్ద ముగిసింది.
దీంతో నిఫ్టీ వరుసగా ఆరో సెషన్లోనూ నష్టాలను నమోదు చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో కొన్ని షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి.
యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐటీ, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మిగిలిన కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 4,394.72 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కూడా కీలకంగా మారాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 4,394.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.