Page Loader
Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు
నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 187.86 పాయింట్లు తగ్గి 78,520 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి 23,762 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.53 వద్ద కదలాడుతోంది.

వివరాలు 

ఆదాయ వృద్ధితో కూడిన మందగమనం

నిఫ్టీ సూచీలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అదే సమయంలో, ట్రెంట్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎం అండ్‌ ఎం, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. దేశీయ మార్కెట్లో స్వల్పకాలిక భయాలు తొలగినప్పటికీ, ప్రధాన సంకేతాలు లేకపోవడంతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా, షేర్ల ధరలు ఇంకా అధిక స్థాయిల్లో ఉన్నాయని వారు భావిస్తున్నారు. డిసెంబరు త్రైమాసికంలో మన కంపెనీల ఆదాయ వృద్ధితో కూడిన మందగమనం కొనసాగుతుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా సూచీలు నష్టాలను నమోదు చేస్తున్నాయి.