Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100
ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో, సూచీలు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 72 పాయింట్ల లాభంతో 82,596 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 25,172 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌కి చెందిన 30 షేర్లలో ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,బజాజ్ ఫైనాన్స్‌,యాక్సిస్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ,అదానీ పోర్ట్స్‌ లాభాల్లో ఉన్నాయి. అదే సమయంలో,ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌,టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టీసీఎస్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.35 డాలర్లు 

విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 85.46 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.35 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా,బంగారం ధర ఔన్సుకు 3,394.50 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు,అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.50 శాతం పడిపోయింది, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.27 శాతం నష్టపోయింది. అయితే, డోజోన్స్ సూచీ మాత్రం స్థిరంగా ముగిసింది.

వివరాలు 

మిశ్రమంగా ఆసియా మార్కెట్  ట్రేడింగ్‌

ఆసియా మార్కెట్లలోనూ మిశ్రమంగా ట్రేడింగ్‌ జరుగుతోంది. జపాన్‌ నిక్కీ 0.71 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.60 శాతం, షాంఘై 0.04 శాతం నష్టపోతుండగా, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ సూచీ మాత్రం 0.22 శాతం లాభంతో ట్రేడవుతోంది. మదుపర్ల దృష్టిలో, బుధవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.446 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,585 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.