LOADING...
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌కు 14 పాయింట్ల లాభం
సెన్సెక్స్‌కు 14 పాయింట్ల లాభం

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌కు 14 పాయింట్ల లాభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం పెద్దగా ఊపు చూపకుండా స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులు నమోదు చేసిన ప్రధాన సూచీలు చివరకు గ్రీన్‌లో నిలిచాయి. శుక్రవారం విడుదల కానున్న భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్త వైఖరి అవలంబించారు. విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.84 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 96.61 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 4,469 డాలర్ల వద్ద ట్రేడైంది.

వివరాలు 

స్వల్ప లాభంలో ముగిసిన సూచీలు

ముంబయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ గత ముగింపు 74,346.17 పాయింట్లతో పోలిస్తే 73,935.83 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇంట్రాడేలో 73,807.30 కనిష్ఠ స్థాయి నుంచి 74,544.24 గరిష్ఠ స్థాయి వరకు కదిలిన సెన్సెక్స్‌ చివరకు 13.84 పాయింట్లు పెరిగి 74,360.01 వద్ద ముగిసింది. అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ నిఫ్టీ 10.95 పాయింట్లు లాభపడి 23,416.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో టైటాన్‌, ఎటర్నల్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా,స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)షేర్లు లాభాలు నమోదు చేశాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి.

Advertisement