Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం 
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్‌ విషయంపై ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. రోజంతా లాభ-నష్టాల మధ్య కదలాడిన సూచీలు, చివరకు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభంతో ముగిసింది, అయితే నిఫ్టీ 26 పాయింట్ల నష్టాన్ని ఎదుర్కొంది. సెన్సెక్స్‌ ఉదయం 77,637.01 (క్రితం ముగింపు 77,500.57) వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. బడ్జెట్‌ ప్రభావంతో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యింది. ఇంట్రాడేలో 77,006.47 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 5 పాయింట్ల లాభంతో 77,505.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ద స్థిరపడింది.

వివరాలు 

సెన్సెక్స్‌ 30 సూచీలో షేర్లు లాభపడ్డాయి 

సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, ఐటీసీ హోటల్స్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఇక, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.