Stock market: నాలుగు రోజుల నష్టాలకు చెక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రధాన సూచీలు, ట్రేడింగ్ చివరి దశలో కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని గ్రీన్ జోన్లో స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాలకు చెందిన షేర్లలో నమోదైన కొనుగోళ్లు మార్కెట్కు బలాన్నిచ్చాయి. సెన్సెక్స్ క్రితం ముగింపు 74,267.34 పాయింట్లతో పోలిస్తే 73,945.20 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో 73,815.12 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ, మధ్యాహ్నం తర్వాత వేగంగా కోలుకుంది. అనంతరం 74,862.19 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన సెన్సెక్స్, చివరకు 382.50 పాయింట్లు పెరిగి 74,649.84 వద్ద ముగిసింది.
వివరాలు
ఐటీ షేర్లలో కొనుగోళ్లు
ఇక నిఫ్టీ కూడా కొనుగోళ్ల మద్దతుతో 100.95 పాయింట్లు లాభపడి 23,483.55 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.95.28 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్ల సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 93.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ధర 4,528 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.