NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు 
    స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు

    Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

    అంతర్జాతీయంగా ఒత్తిడులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లు పాజిటివ్‌ వైపు కదలిక చూపించాయి.

    అమెరికా ప్రభుత్వం విధించే టారిఫ్‌లపై ఆందోళనలు తగ్గిపోవడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది.

    ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల షేర్లకు బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది.

    దీంతో బ్యాంక్ నిఫ్టీ చారిత్రాత్మక గరిష్ఠస్థాయిని అధిగమించింది.

    సెన్సెక్స్‌ ప్రారంభంలోనే దాదాపు 350 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 23,900కు పైగా స్థాయిలో ప్రయాణం ప్రారంభించింది.

    ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 428 పాయింట్లు పెరిగి 79,008 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 23,955 వద్ద కొనసాగుతున్నాయి.

    వివరాలు 

     మిశ్రమ ధోరణితో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు

    సెన్సెక్స్‌ 30 స్టాకుల్లో యాక్సిస్ బ్యాంక్‌, టెక్ మహీంద్రా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,ఇన్ఫోసిస్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,ఎస్‌బీఐ,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,ఇండస్‌ఇండ్ బ్యాంక్‌,బజాజ్ ఫిన్‌సర్వ్‌,పవర్‌గ్రిడ్‌, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతి షేర్లు నష్టాలబాట పట్టాయి.

    అమెరికా స్టాక్ మార్కెట్లు గత సెషన్‌లో మిశ్రమ ధోరణితో ముగిశాయి. డోజోన్స్‌ 1.33 శాతం పడిపోయింది.

    నాస్‌డాక్‌ 0.13 శాతం నష్టపోయింది. కానీ ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.13 శాతం లాభపడింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ASX 0.78 శాతం, హాంకాంగ్ మార్కెట్ 1.61 శాతం, షాంఘై 0.33 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే జపాన్‌ నిక్కీ మాత్రం 1.24 శాతం నష్టాల్లో ఉంది.

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 66.88 డాలర్లు 

    ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 66.88 డాలర్ల వద్ద ఉంది.

    బంగారం ధర ఔన్సుకు 3,392 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) సుమారు రూ.4,668 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేయగా, దేశీయ ఇన్వెస్టర్లు (DIIs) రూ.2,006 కోట్ల షేర్లను విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్! కోవిడ్
    LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌ బిజినెస్
    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 78 వేల పైకి సెన్సెక్స్‌! బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025