NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

    ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 25,131 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌లో భాగమైన 30 ప్రధాన షేర్లలో ఎంఅండ్‌ఎం,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఎటర్నల్‌,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,భారతీ ఎయిర్‌టెల్‌,ఎన్టీపీసీ,యాక్సిస్‌ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    ఇకపోతే, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్అండ్‌టీ, ఐటీసీ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్‌కు 66.75 డాలర్లు

    విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 85.48 వద్ద ప్రారంభమైంది.

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్‌కు 66.75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సు కొలమానంలో 3,359 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.

    నాస్‌డాక్‌ సూచీ 0.63 శాతం పెరిగింది, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.55 శాతం లాభపడగా, డో జోన్స్ సూచీ 0.25 శాతం పెరిగింది.

    ఇదే బాటలో ఆసియా మార్కెట్లు కూడా బుధవారం లాభాల దిశగా పయనించాయి.

    వివరాలు 

    రూ.2,302 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

    జపాన్ నిక్కీ సూచీ 0.45 శాతం, ఆస్ట్రేలియా ASX 0.28 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.87 శాతం, షాంఘై సూచీ 0.47 శాతం లాభాలను నమోదుచేశాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) వరుసగా మూడో రోజూ కొనుగోళ్లలో పాల్గొన్నారు.

    మంగళవారం ఒక్కరోజే రూ.2,302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    అంతేకాకుండా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా అదే రోజున నికరంగా రూ.1,113 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Pakistan: పాక్ జట్టుకు షాక్‌.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు! పాకిస్థాన్
    Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే బంగారం
    Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్! కీర్తి సురేష్

    స్టాక్ మార్కెట్

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  బిజినెస్
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  బిజినెస్
    Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?  బిజినెస్
    Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025