
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.
అమెరికా తమ ప్రతీకార సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో మార్కెట్లలో ఉత్సాహం చిగురించింది.
ఈప్రకటన మార్కెట్ ప్రారంభానికి ముందే వెలువడటంతో,ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ సుమారు వెయ్యి పాయింట్ల పెరుగుదలతో జోరుగా మొదలైంది.
ఆఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. అమెరికా,జూలై 9వతేదీ వరకూ అదనంగా విధించనున్న సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.
ఇదే సమయంలో,గత ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సహా 60దేశాలపై అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.
తాజాప్రకటన నేపథ్యంగా స్టాక్ మార్కెట్లలో లాభాల ఊపెత్తింది.ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 74,835.49 వద్ద పాజిటివ్గా ప్రారంభమైంది.
వివరాలు
నిఫ్టీ 429.40 పాయింట్ల లాభంతో 22,828.55 వద్ద స్థిరపడింది
ఇంట్రాడే సమయంలో సెన్సెక్స్ కనిష్ఠంగా 74,762.84 పాయింట్లకు చేరగా, గరిష్ఠంగా 75,467.33 పాయింట్లను తాకింది.
చివరకు ఈ సూచీ 1,310.11 పాయింట్ల భారీ లాభంతో 75,157.26 వద్ద ట్రేడింగ్ ముగించింది.
మరోవైపు, నిఫ్టీ 429.40 పాయింట్ల లాభంతో 22,828.55 వద్ద స్థిరపడింది. ఈ రోజు ట్రేడింగ్లో సుమారు 3,006 షేర్లు లాభపడగా, 807 షేర్లు నష్టపోయాయి.
నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ వంటి కంపెనీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.
వివరాలు
స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం వృద్ధి
అదే సమయంలో టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు కొంత నష్టపోయాయి.
మార్కెట్ రంగాల విషయానికి వస్తే, మెటల్ సూచీ 4 శాతం పెరిగింది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్యూ, టెలికాం, ఫార్మా రంగాలు ఒక్కొక్కటి సుమారు 2 శాతం చొప్పున లాభపడ్డాయి.
దీంతో అన్ని రంగాల సూచీలు పాజిటివ్గా ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.8 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం వృద్ధిని నమోదు చేసింది.