NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
    భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

    Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.

    అమెరికా తమ ప్రతీకార సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో మార్కెట్లలో ఉత్సాహం చిగురించింది.

    ఈప్రకటన మార్కెట్ ప్రారంభానికి ముందే వెలువడటంతో,ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ సుమారు వెయ్యి పాయింట్ల పెరుగుదలతో జోరుగా మొదలైంది.

    ఆఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. అమెరికా,జూలై 9వతేదీ వరకూ అదనంగా విధించనున్న సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

    ఇదే సమయంలో,గత ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సహా 60దేశాలపై అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.

    తాజాప్రకటన నేపథ్యంగా స్టాక్ మార్కెట్లలో లాభాల ఊపెత్తింది.ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 74,835.49 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.

    వివరాలు 

    నిఫ్టీ 429.40 పాయింట్ల లాభంతో 22,828.55 వద్ద స్థిరపడింది

    ఇంట్రాడే సమయంలో సెన్సెక్స్ కనిష్ఠంగా 74,762.84 పాయింట్లకు చేరగా, గరిష్ఠంగా 75,467.33 పాయింట్లను తాకింది.

    చివరకు ఈ సూచీ 1,310.11 పాయింట్ల భారీ లాభంతో 75,157.26 వద్ద ట్రేడింగ్ ముగించింది.

    మరోవైపు, నిఫ్టీ 429.40 పాయింట్ల లాభంతో 22,828.55 వద్ద స్థిరపడింది. ఈ రోజు ట్రేడింగ్‌లో సుమారు 3,006 షేర్లు లాభపడగా, 807 షేర్లు నష్టపోయాయి.

    నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ వంటి కంపెనీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.

    వివరాలు 

    స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం వృద్ధి

    అదే సమయంలో టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు కొంత నష్టపోయాయి.

    మార్కెట్ రంగాల విషయానికి వస్తే, మెటల్ సూచీ 4 శాతం పెరిగింది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ, టెలికాం, ఫార్మా రంగాలు ఒక్కొక్కటి సుమారు 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

    దీంతో అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.8 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం టెక్నాలజీ
    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్

    స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట వ్యాపారం
    Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది ఇన్ఫోసిస్
    Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ    బిజినెస్
    Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025