NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం 
    స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా, రోజంతా చిన్న పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

    కొన్ని ఎంపిక చేయబడిన షేర్లను తప్పితే, మిగిలిన మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించలేదు.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో విక్రయాలు చోటుచేసుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల లాభాలు సూచీలను మద్దతుగా నిలిపాయి.

    ఆసియా మార్కెట్లు కూడా ఈ రోజు మిశ్రమ ధోరణిలో కదలాడాయి.

    సెన్సెక్స్‌ సూచీ ఈరోజు ఉదయం 80,396.92 పాయింట్ల వద్ద, గత ముగింపు స్థాయైన 80,218.37 పాయింట్లను మించి లాభాల్లో ప్రారంభమైంది.

    వివరాలు 

    డాలరుతో రూపాయి మారక విలువ 85.25

    ఇంట్రాడే వ్యాపారంలో 80,122.02 నుంచి 80,661.31 పాయింట్ల మధ్య ఒడిదొడుకులకు లోనైంది.

    చివరకు సెన్సెక్స్‌ 70.01 పాయింట్ల స్వల్ప లాభంతో 80,288.38 వద్ద ముగిసింది.

    నిఫ్టీ సూచీ 7.45 పాయింట్ల లాభంతో 24,335.95 వద్ద స్థిరంగా ముగిసింది. ఈ రోజు డాలరుతో రూపాయి మారక విలువ 85.25గా నమోదైంది.

    సెన్సెక్స్‌లో అంతర్భూతమై ఉన్న 30 ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేరు వరుసగా రెండో రోజు 2.20 శాతం లాభంతో ముగియడం గమనార్హం.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64 డాలర్లు 

    టెక్ మహీంద్రా,ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు కూడా లాభాల బాట పట్టాయి. అయితే, అల్ట్రాటెక్ సిమెంట్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    స్టాక్ మార్కెట్

    Stock market: టారిఫ్‌ల ప్రభావం అంతంతే.. మోస్తరు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌  బిజినెస్
    Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్ వ్యాపారం
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025