LOADING...
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 579 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 579 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 579 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం మదుపర్ల విశ్వాసాన్ని పెంచాయి. దీనికి తోడు ఐటీ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదవడంతో మార్కెట్‌కు మరింత ఊతం లభించింది. ఫలితంగా సెన్సెక్స్‌,నిఫ్టీ రెండూ గణనీయమైన లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 579.48 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 169.85 పాయింట్లు పెరిగింది. ఉదయం సెన్సెక్స్‌ 77,083.14 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో అది 76,922.64 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ మొత్తం సానుకూల ధోరణిలో కొనసాగిన సూచీ ఒక దశలో 77,578.93 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకుంది.

వివరాలు 

రూపాయి మారకం విలువ 95.40గా నమోదు 

చివరికి 579.48 పాయింట్ల లాభంతో 77,502.12 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 169.85 పాయింట్లు పెరిగి 24,175.70 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌-30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అయితే ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీఈఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.40గా నమోదైంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు బ్యారెల్‌ ధర 70.54 డాలర్ల వద్ద కొనసాగింది. అదే సమయంలో బంగారం ఔన్సు ధర 4,063 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement