Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా, సూచీలు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రారంభంలో సూచీలు స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రధాన షేర్ల అమ్మకాల ప్రభావంతో నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ (Sensex) 170 పాయింట్ల నష్టంతో 74,164 వద్ద, నిఫ్టీ (Nifty) 32 పాయింట్లు తగ్గి 22,512 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 69.60 డాలర్లు
అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 69.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,911.40 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.14 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి.ఎస్అండ్పీ సూచీ,నాస్డాక్ 1.50 శాతం మేర నష్టపోగా,డోజోన్స్ స్థిరంగా ముగిసింది.
వివరాలు
స్థిరంగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 1.57 శాతం, జపాన్ నిక్కీ 1.85 శాతం నష్టాల్లో కదలాడుతుండగా, షాంఘై, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.2,377 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,618 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.