Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. కారణమేంటంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిలో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు,పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు,క్రూడాయిల్ ధరల పెరుగుదలతో పాటు బ్యాంకింగ్ రంగ షేర్లలో కనిపించిన అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రధాన సూచీలు గణనీయంగా క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు పడిపోగా,నిఫ్టీ 24,200 మార్కును దిగువకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు కోల్పోయి 77,533.51 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్లో ఇది 700 పాయింట్ల వరకు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు తగ్గి 24,183.35 వద్ద కొనసాగింది. సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్,ఇన్ఫోసిస్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.
వివరాలు
మార్కెట్పై ఒత్తిడి ఎందుకు పెరిగింది?
అదే సమయంలో ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 4 శాతం పెరిగి బ్యారెల్కు 91 డాలర్ల స్థాయికి చేరుకోవడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి.
దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై కనిపించింది. ఆసియా మార్కెట్లు కూడా బలహీన ధోరణితో ప్రారంభమయ్యాయి.
జపాన్కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీలు సుమారు 4 శాతం చొప్పున నష్టపోవడం భారత మార్కెట్ల సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది.
వివరాలు
మార్కెట్పై ఒత్తిడి ఎందుకు పెరిగింది?
దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో భారీ అమ్మకాలే మార్కెట్పై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
ఈ రెండు బ్యాంకులు శనివారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్లు మార్కెట్ అంచనాలను అందుకోకపోవడంతో పెట్టుబడిదారులు విక్రయాలకు మొగ్గుచూపారు.
ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు దాదాపు 5 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేరు సుమారు 6 శాతం మేర క్షీణించాయి.
ఈ ప్రభావం మొత్తం బ్యాంకింగ్ సూచీతో పాటు ప్రధాన మార్కెట్ సూచీలపై స్పష్టంగా కనిపించింది.