Page Loader
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోలు ఆసక్తిని చూపడంతో మార్కెట్లకు మద్దతు లభించింది. ఈ ప్రభావంతో, ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,200కు పైగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 328 పాయింట్ల లాభంతో 76,372 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,258 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, జొమాటో, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

బంగారం ధర ఔన్సుకు 3,160 డాలర్లు 

ఇక, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ 74.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,160 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో 85.73 వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ సూచీ 0.38% లాభపడగా, నాస్‌డాక్ 0.87% పెరిగింది. అయితే, డౌజోన్స్ స్వల్ప నష్టంతో ముగిసింది.

వివరాలు 

 స్థిరంగా ట్రేడవుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు

ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ASX 0.22% లాభపడగా, జపాన్ నిక్కీ 0.04% లాభంతో ఉంది. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.62% మరియు షాంఘై సూచీ 0.17% లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా ₹5,902 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) ₹4,323 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.