
Stock Market: ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో సూచీలు ఒడిదొడుకులకు లోనయ్యాయి. మొదట ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ, కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్ల నష్టంతో 77,444 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ట్రేడవుతోంది.
Details
లాభాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,083 డాలర్ల మార్క్ దాటి ట్రేడవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.66 వద్ద ప్రారంభమైంది.
Details
నష్టాల్లో అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఎస్అండ్పీ సూచీ 0.33%, నాస్డాక్ 0.53%, డౌజోన్స్ 0.37% నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి.
ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్ 0.07% లాభంతో, జపాన్ నిక్కీ 2.09%, హాంకాంగ్ హాంగెసెంగ్ 0.81%, షాంఘై 0.70% నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం భారీగా కొనుగోళ్లు జరిపారు.
ఒక్క రోజులోనే రూ.11,111 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,518 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.