Page Loader
Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700
లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700

Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

బుధవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ, దేశీయ సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల వల్ల మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయానికి సెన్సెక్స్‌ 159 పాయింట్ల లాభంతో 81,345 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 24,727 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

బంగారం ధర ఔన్సు గోల్డ్‌ 3,307 డాలర్లు 

సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన కంపెనీలలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు, ఎటర్నల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికొస్తే, బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.39 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర ఔన్సు గోల్డ్‌ 3,307 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

నష్టాల్లో ముగిసిన  అమెరికా స్టాక్‌ మార్కెట్లు 

మరోవైపు, మంగళవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.39 శాతం నష్టపోగా, డోజోన్స్ 0.27 శాతం తగ్గింది. నాస్‌డాక్ 0.38 శాతం నష్టంతో ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.69 శాతం, షాంఘై మార్కెట్‌ 0.38 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.70 శాతం లాభాల్లో ఉన్నాయి. కానీ జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ మాత్రం 0.10 శాతం నష్టంతో కదలాడుతోంది. నేటి మార్కెట్‌ డేటా ప్రకారం, మంగళవారం నాడు విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,738 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.