Swiggy: స్విగ్గీకి షాక్.. సహవ్యవస్థాపకుడు లక్ష్మీ నందన్ రెడ్డి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నందన్ రెడ్డి కంపెనీ బోర్డు నుంచి తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం ఆయన పూర్తి సమయ డైరెక్టర్గా, అలాగే ఇన్నోవేషన్ విభాగానికి హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 10 నుండి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని స్విగ్గీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. వృత్తిపరమైన ఆసక్తుల మార్పుల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఫైలింగ్లో పేర్కొనబడింది.
వివరాలు
జూన్ 1 నుంచి కొత్త డైరెక్టర్లు
అదే సమయంలో, ప్రోసస్ వెంచర్స్ తరఫున నామినీ డైరెక్టర్గా రేనన్ డీ క్యాస్ట్రో నియామకాన్ని స్విగ్గీ బోర్డు ఆమోదించింది. అలాగే స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫణి కిషన్ అద్దేపల్లి, స్విగ్గీ గ్రూప్ సీఎఫ్ఓ రాహుల్ బోత్రా ఇద్దరినీ జూన్ 1 నుండి అదనపు డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. స్విగ్గీ ప్రారంభ దశల నుంచే ఫణి కిషన్, రాహుల్ బోత్రా సంస్థతో కలిసి పనిచేస్తున్నారని గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటి తెలిపారు. అలాగే లక్ష్మీ నందన్ రెడ్డి బెంగళూరులో తొలిసారి పరిచయమైనప్పటి నుంచి స్విగ్గీ ఒక పెద్ద ప్లాట్ఫామ్గా ఎదిగే ప్రయాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన భవిష్యత్ విజయవంతంగా సాగాలని శ్రీహర్ష మజేటి ఆకాంక్షించారు.