NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
    తదుపరి వార్తా కథనం
    PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
    ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన

    PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాల నుండి సమాచారం అందింది.

    ప్రభుత్వ ప్రమేయం తగ్గించి, మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనల ప్రకారం వాటాలను 25 శాతానికి పెంచేందుకు ఈ చర్యలపై చర్చ జరుగుతోంది.

    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లోని వాటాలను కేంద్రం విక్రయించే దిశగా అడుగులు వేస్తోందని రాయిటర్స్ కథనంలో పేర్కొంది.

    ఈ ప్రక్రియకు ఆర్థిక మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం పొందే అవకాశం ఉందని సమాచారం.

    Details

    పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 25 శాతం

    సెబీ నిబంధనల ప్రకారం, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 25 శాతం ఉండటం తప్పనిసరి.

    అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నిబంధనల నుండి 2026 ఆగస్టు వరకు మినహాయింపు లభించింది. సకాలంలో నిబంధనలు అమలు చేయడంపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

    ఈ విక్రయాలు ఓపెన్ మార్కెట్‌ ఆఫర్‌ ఫర్ సేల్‌ రూపంలో జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    ఈ ప్రక్రియ ద్వారా మార్కెట్‌ లైక్విడిటీ పెరిగి, ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రానున్న రోజుల్లో ఇది బ్యాంకింగ్‌ రంగంలో మార్పులకు దారితీసే ముఖ్యమైన పరిణామంగా మారే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బ్యాంక్

    దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు బిజినెస్
    ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం ఆర్థిక శాఖ మంత్రి
    భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    కేంద్ర ప్రభుత్వం

    Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు బిజినెస్
    Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన  బిజినెస్
    AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం  భారతదేశం
    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025