LOADING...
Shankh Mitra: ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి
మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి

Shankh Mitra: ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆయన వార్షిక వేతన ప్యాకేజీ 821 మిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాత శంఖ్ మిత్రా రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ వెల్‌టవర్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వివరాలు 

ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ

శంఖ్ మిత్రా తన ఉన్నత విద్యను భారత్‌లోనే పూర్తి చేశారు. ఆయన కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం అమెరికాకు వెళ్లి కొలంబియా బిజినెస్ స్కూల్‌లో అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో పనిచేసిన ఆయన, తర్వాత ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, మిలీనియం పార్ట్‌నర్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవలందించారు.

వివరాలు 

2018లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌.. రెండేళ్ల తర్వాత సీఈఓ

2016లో వెల్‌టవర్ సంస్థలో చేరిన శంఖ్ మిత్రా, సీనియర్ హౌసింగ్,హెల్త్‌కేర్ రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థలో వేగంగా ఎదిగారు. 2018లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, రెండేళ్ల తర్వాత సీఈఓగా నియమితులయ్యారు. పెట్టుబడుల నిర్వహణలో ఆయన ప్రతిభ, సంస్థ నిర్వహణలో చూపిన సామర్థ్యాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు కంపెనీ తెలిపింది. అప్పటి సీఈఓ థామస్ జే డి రోసా నుంచి బాధ్యతలు స్వీకరిస్తూ, "వెల్‌టవర్ సీఈఓగా సేవలందించే అవకాశం రావడం నాకు గౌరవంగా, వినమ్రంగా భావిస్తున్నాను" అని శంఖ్ మిత్రా పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

మొత్తం వేతనంలో 99 శాతం స్టాక్ గ్రాంట్లే

శంఖ్ మిత్రా వేతన ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ గ్రాంట్ల రూపంలోనే ఉంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఆయన మొత్తం వేతనంలో 99 శాతం స్టాక్ గ్రాంట్లే కాగా, గత అక్టోబర్‌లోనే 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించారు. 2031 వరకు వెల్‌టవర్‌లో సీఈఓగా కొనసాగితే, ఆయనకు మంజూరైన షేర్లలో 50 శాతం లభిస్తాయి. మిగిలిన షేర్లు కంపెనీ మార్కెట్ విలువ 45 శాతం పెరగడం, అలాగే ఐదేళ్ల వ్యవధిలో సంస్థ షేర్లు పలు ప్రధాన స్టాక్ సూచీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మాత్రమే ఆయనకు లభిస్తాయి.

Advertisement