NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / TRAI: 18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TRAI: 18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం 
    18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం

    TRAI: 18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో టెలికాం సేవల సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

    ఇందులో భాగంగా, 22 టెలికాం సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో కొత్త 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించేందుకు రూ.17,940 కోట్ల విలువైన ప్రణాళికకు అనుమతి ఇచ్చింది.

    అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    వేలంలో ముఖ్యమైన అంశాలు 

    మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ వేలానికి సిద్ధంగా ఉంది.

    టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ ఎంతో కీలకం.

    అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో వేగవంతమైన కనెక్టివిటీ అందించేందుకు ఇది మద్దతునిస్తుంది.

    ప్రతి సర్కిల్‌కు 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది.

    స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లవారీగా భిన్నంగా ఉంటుంది:

    ఢిల్లీ సర్కిల్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు

    ముంబైలో రూ.67 లక్షలు

    మహారాష్ట్రలో రూ.54 లక్షలు

    ఆంధ్రప్రదేశ్‌లో రూ.49 లక్షలు

    వివరాలు 

    మారటోరియం అభ్యర్థన తిరస్కరణ 

    స్పెక్ట్రమ్ కొనుగోలుపై 5-6 సంవత్సరాల వడ్డీ లేని మారటోరియం (చెల్లింపు సౌలభ్యం) ఇవ్వాలనే టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది.

    ముందస్తు చెల్లింపు విధానాన్ని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల పాటు ఉపయోగించుకునేలా అందించనున్నారు.

    హైస్పీడ్ ఇంటర్నెట్, 5జీ సేవలకు మద్దతు

    ఈ వేలం ద్వారా 5జీ సేవల ప్రారంభానికి కావాల్సిన స్పెక్ట్రమ్‌ను టెలికాం కంపెనీలకు అందించనున్నారు.

    37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ పట్టణ ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీ కోసం అత్యంత ఉపయోగకరంగా మారనుంది.

    అంతేకాకుండా, యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించాలని ట్రాయ్ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెలికాం సంస్థ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ప్లాన్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025