NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Tupperware: అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్ 
    తదుపరి వార్తా కథనం
    Tupperware: అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్ 
    అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్

    Tupperware: అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాకు చెందిన ప్రముఖ కిచెన్‌వేర్ కంపెనీ టప్పర్‌వేర్ బ్రాండ్స్ కార్ప్, అమ్మకాలు తగ్గడం, పెరుగుతున్న పోటీ కారణంగా దివాలా పిటిషన్ దాఖలు చేసింది.

    కంపెనీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక వనరులు లేకపోతే వ్యాపారాన్ని కొనసాగించడం కష్టం అవుతుందని గతంలో తెలిపిన విషయం విదితమే.

    దివాలా ప్రక్రియలో కూడా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వ్యాపారాన్ని విక్రయించడానికి కోర్టు అనుమతి కోరతామని కూడా పేర్కొంది.

    ఈ కిచెన్‌వేర్ దిగ్గజం గత కొన్ని దశాబ్దాలుగా ఆహార నిల్వ ఉత్పత్తుల మార్కెట్‌లో ప్రధాన స్థానాన్ని పొందింది.

    కానీ 2020 నుంచి వ్యాపార సామర్థ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయని కంపెనీ హెచ్చరించింది.

    ఫైలింగ్ 

    150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక

    ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీ దాని యూఎస్ ఫ్యాక్టరీని మూసివేయాలని, 150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక చేసిందని తెలుస్తోంది.

    బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, టప్పర్‌వేర్ ప్రస్తుతం భారీ అప్పుల్లో ఉంది. పబ్లిక్‌గా ట్రేడవుతున్న ఈ కంపెనీ, దివాలా పిటిషన్ ద్వారా న్యాయ పరిరక్షణ కోరింది.

    కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, దాని ఆస్తులు 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటే, అప్పులు 1 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి.

    దివాలా పిటిషన్ వార్తల కారణంగా, కంపెనీ షేర్ల విలువ 50 శాతం పడిపోయింది.

    చర్చలు 

    ఎయిర్ టైట్ సీల్డ్ కంటైనర్లపై పేటెంట్

    1946లో ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ సంస్థ, ఎయిర్ టైట్ సీల్డ్ కంటైనర్లపై పేటెంట్ పొందింది.

    1950లలో మహిళలు ఇళ్లలో టప్పర్‌వేర్ పార్టీలను నిర్వహించి, ఆహార నిల్వ కంటైనర్లను విక్రయించడంతో ఈ బ్రాండ్ వేగంగా ప్రసిద్ధి పొందింది.

    కానీ ఇప్పుడు, మార్కెట్‌లో చౌక ఉత్పత్తులతో పోటీని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ముడిసరకుల ధరలు, వేతనాలు, రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025