ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్లతో పంచుకోనున్న ట్విట్టర్
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. క్రియేటర్లతో ట్విట్టర్ యాడ్ రెవెన్యూ షేర్ ప్రోగ్రామ్ యూట్యూబ్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పోటీపడడంలో సహాయపడుతుంది, వీటికి కూడా యాడ్ రెవిన్యూ షేర్ ప్రోగ్రాం క్రియేటర్లకు చెల్లించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. యాడ్ రెవెన్యూ షేర్ ను సంపాదించడానికి వినియోగదారులకు బ్లూ సభ్యత్వం ఉండాలి. ట్విట్టర్ వినియోగదారులకు ఇప్పటికే టిప్స్/సూపర్ ఫాలోస్ ఫీచర్ల ద్వారా తమ ఖాతాలను మానిటైజ్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రకటన రాబడి వాటాను కావాలంటే క్రియేటర్లకు యాక్టివ్ బ్లూ సబ్స్క్రిప్షన్ను ఉండాలి
అయితే, యూట్యూబ్ లా కాకుండా, ట్విట్టర్ యొక్క కొత్త విధానం క్రియేటర్ రిప్లై థ్రెడ్లలో కనిపించే ప్రకటనలకు మాత్రమే వర్తిస్తుంది. అదనంగా, ప్రకటన రాబడి వాటాను కావాలంటే, క్రియేటర్లకు యాక్టివ్ బ్లూ సబ్స్క్రిప్షన్ను ఉండాలి. అయితే ట్విట్టర్ చెల్లింపు ప్రక్రియ గురించి సమాచారం ఇంకా తెలియదు. ఈ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందడానికి ఎన్ని వైరల్ ట్వీట్లు అవసరమనేది ఇంకా తెలియలేదు. అయితే లెగసీ బ్లూ వెరిఫైడ్ ఖాతాలను నడుపుతున్న క్రియేటర్లతో ఈ ప్రకటన ఆదాయాన్ని ట్విట్టర్ పంచుకోదు. ఈ కొత్త ప్రోగ్రామ్కు వారికి అర్హత లేదు.