NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 
    యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు!

    Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 06, 2025
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వరంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వివాదంలో చిక్కుకుంది.

    భారత ప్రభుత్వానికి గతంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ రచించిన పుస్తకానికి సంబంధించి 2 లక్షల కాపీలను రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రముఖ ఆంగ్లపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' వెల్లడించింది.

    అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుబ్రమణియన్‌ను ఇటీవల భారత ప్రభుత్వం తొలగించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

    సుబ్రమణియన్ గతేడాది 'ఇండియా@100' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని కస్టమర్లు, కార్పొరేట్లు, స్కూల్స్, కాలేజీలు, లైబ్రరీలకు పంపిణీ చేయాలని యూనియన్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ నిర్ణయించింది.

    Details

    పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంపై అనుమానాలు

    ఈ దిశగా, బ్యాంక్ 1,89,450 పేపర్ బ్యాక్‌లను రూ.350 చొప్పున, 10,422 హార్డ్ కవర్ కాపీలను రూ.597 చొప్పున కొనుగోలు చేయాలని ఆర్డర్ పెట్టింది. మొత్తంగా బ్యాంక్ రూ.7 కోట్లు వెచ్చించడానికీ నిర్ణయించింది.

    ఈ పుస్తకం 2024 ఆగస్టులో విడుదల కానున్నప్పటికీ, విడుదలకు ముందు ఈ పుస్తకాన్ని ప్రచురించిన రూపా పబ్లికేషన్స్‌కు యూనియన్ బ్యాంక్ 50 శాతం చెల్లింపులు చేసినట్లు 'ఈటీ' పేర్కొంది.

    సాధారణంగా ఒక ఇంగ్లిష్ పుస్తకం 10 వేల కాపీలు మాత్రమే అమ్మకం అవుతాయి, కానీ 2 లక్షల కాపీలకు యూనియన్ బ్యాంక్ ఆర్డర్ పెట్టడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

    బ్యాంక్‌కు చెందిన 18 జోనల్ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడం కూడా ప్రశ్నలను మరింత పెంచుతోంది.

    Details

    భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన సుబ్రమణియన్

    సుబ్రమణియన్ 2018 నుండి 2021 వరకు భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.

    2022లో ఆయనను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినప్పటికీ, ఈ ఏడాది 30వ తేదీన ఆ పదవి నుంచి తొలగించారు.

    ప్రారంభంలో వివిధ కారణాలు ఇచ్చినా, పుస్తకాన్ని ప్రమోట్ చేయడంలో అన్యాయాలు జరిగి ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.

    అయితే, ఐఎంఎఫ్ స్పందిస్తూ, సుబ్రమణియన్‌ను తొలగించడం భారత ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది. సుబ్రమణియన్‌ స్థానాన్ని పరమేశ్వరన్ అయ్యర్‌తో భర్తీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    వ్యాపారం

    Uber Auto: ఉబర్‌ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్‌ పేమెంట్‌ ఉబర్
    FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి? స్టాక్ మార్కెట్
    Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్ బిజినెస్
    UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్ యూపీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025