Page Loader
Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 
యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు!

Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 06, 2025
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వివాదంలో చిక్కుకుంది. భారత ప్రభుత్వానికి గతంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ రచించిన పుస్తకానికి సంబంధించి 2 లక్షల కాపీలను రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రముఖ ఆంగ్లపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుబ్రమణియన్‌ను ఇటీవల భారత ప్రభుత్వం తొలగించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణియన్ గతేడాది 'ఇండియా@100' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని కస్టమర్లు, కార్పొరేట్లు, స్కూల్స్, కాలేజీలు, లైబ్రరీలకు పంపిణీ చేయాలని యూనియన్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ నిర్ణయించింది.

Details

పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంపై అనుమానాలు

ఈ దిశగా, బ్యాంక్ 1,89,450 పేపర్ బ్యాక్‌లను రూ.350 చొప్పున, 10,422 హార్డ్ కవర్ కాపీలను రూ.597 చొప్పున కొనుగోలు చేయాలని ఆర్డర్ పెట్టింది. మొత్తంగా బ్యాంక్ రూ.7 కోట్లు వెచ్చించడానికీ నిర్ణయించింది. ఈ పుస్తకం 2024 ఆగస్టులో విడుదల కానున్నప్పటికీ, విడుదలకు ముందు ఈ పుస్తకాన్ని ప్రచురించిన రూపా పబ్లికేషన్స్‌కు యూనియన్ బ్యాంక్ 50 శాతం చెల్లింపులు చేసినట్లు 'ఈటీ' పేర్కొంది. సాధారణంగా ఒక ఇంగ్లిష్ పుస్తకం 10 వేల కాపీలు మాత్రమే అమ్మకం అవుతాయి, కానీ 2 లక్షల కాపీలకు యూనియన్ బ్యాంక్ ఆర్డర్ పెట్టడం అనుమానాలు రేకెత్తిస్తోంది. బ్యాంక్‌కు చెందిన 18 జోనల్ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడం కూడా ప్రశ్నలను మరింత పెంచుతోంది.

Details

భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన సుబ్రమణియన్

సుబ్రమణియన్ 2018 నుండి 2021 వరకు భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 2022లో ఆయనను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినప్పటికీ, ఈ ఏడాది 30వ తేదీన ఆ పదవి నుంచి తొలగించారు. ప్రారంభంలో వివిధ కారణాలు ఇచ్చినా, పుస్తకాన్ని ప్రమోట్ చేయడంలో అన్యాయాలు జరిగి ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ఐఎంఎఫ్ స్పందిస్తూ, సుబ్రమణియన్‌ను తొలగించడం భారత ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది. సుబ్రమణియన్‌ స్థానాన్ని పరమేశ్వరన్ అయ్యర్‌తో భర్తీ చేసింది.