US: వెనిజులా చమురు సంస్థలో 35 శాతం వాటాను కొనుగోలు చేయనున్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులాకు చెందిన వ్యాపారవేత్త అలెజాండ్రో బెటాన్కోర్ట్ యాజమాన్యంలోని ఎనర్జీ సంస్థ నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్నర్స్లో 35 శాతం పాసివ్ వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా సంస్థ ఉత్పత్తి చేసే చమురులో 20 శాతాన్ని ఉత్పత్తి వ్యయానికే కొనుగోలు చేసే ప్రాధాన్య హక్కులు కూడా అమెరికాకు లభించనున్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) కథనం ప్రకారం.. ఈ పెట్టుబడిని 'పెన్నీ వారెంట్స్' ద్వారా నిర్మించనున్నారు. భారీగా మూలధనం ఖర్చు చేయకుండానే కంపెనీలో ఈక్విటీ వాటా పొందేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు.
వివరాలు
పెన్నీ వారెంట్స్ ద్వారా పెట్టుబడి..
అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ క్యాపిటల్ (OSC) ఈ పెట్టుబడి నిర్మాణాన్ని చేపట్టనుంది.
ప్రపంచ ఇంధన మార్కెట్లలో అమెరికా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనిజులాలోని భారీ చమురు నిల్వల్లో ఐదో వంతుపై అమెరికా నియంత్రణ సాధిస్తుందని ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది.
ట్రంప్ ప్రకారం.. ప్రైవేట్ వ్యాపార సంస్థతో భాగస్వామ్యం ద్వారా వెనిజులాలో నిర్ధారిత చమురు నిల్వల్లో 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉన్న వాటిపై అమెరికా మెజారిటీ నియంత్రణ సాధించింది.
వివరాలు
OSC పాత్రపై పెంటగాన్ వివరణ
అయితే.. ప్రైవేట్ కంపెనీల్లో OSC ఈక్విటీ వాటాలను తీసుకోదని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పష్టం చేశారు.
పెట్టుబడుల అభివృద్ధి, ఫైనాన్సింగ్ కోసం రుణం, రుణ హామీ లేదా సాంకేతిక సహాయం రూపంలో మూలధన సహకారం అందించడం వరకే OSC పాత్ర పరిమితమని ఆయన తెలిపారు.