NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌
    భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు

    Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, భారతీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడవుతున్నాయి.

    అమెరికా టారిఫ్‌లపై ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పడటంతో మార్కెట్‌కు ఊరట లభించింది.

    ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి ప్రముఖ బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్‌ నిఫ్టీ చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది.

    దీనితో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతుండగా, నిఫ్టీ 24,000 మార్క్‌ను అధిగమించింది.

    వివరాలు 

    మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

    మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో సెన్సెక్స్ 1047.18 పాయింట్లు పెరిగి 79,600.38 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 325.8 పాయింట్లు పెరిగి 24,177.45 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌లో చేర్చిన 30 కంపెనీలలో యాక్సిస్ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

    ఇదే సమయంలో అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతి షేర్లు నష్టాల్లో కదులుతున్నాయి.

    అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్‌ సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్‌ 1.33 శాతం నష్టపోయినప్పటికీ, నాస్‌డాక్ 0.13 శాతం నష్టంతో ముగిసింది.

    వివరాలు 

    బంగారం ధర ఔన్సుకు 3,392 డాలర్లు 

    ఎస్‌అండ్‌పీ 500 సూచీ మాత్రం 0.13 శాతం లాభంతో ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ఈ దిశలోనే ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.78 శాతం, హాంకాంగ్‌ మార్కెట్ 1.61 శాతం, షాంఘై మార్కెట్ 0.33 శాతం లాభాలను నమోదు చేస్తున్నాయి.

    జపాన్‌లో నిక్కీ సూచీ మాత్రం 1.24 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    బంగారం ధర ఔన్సుకు 3,392 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.4,668 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) మాత్రం రూ.2006 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 78 వేల పైకి సెన్సెక్స్‌! బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65 బిజినెస్
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025